ramana dikshitulu: నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా.. రమణదీక్షితులను క్షమాపణలు కోరుతున్నా: ఏపీ మంత్రి సోమిరెడ్డి

  • విజయ సాయిరెడ్డిని అనాల్సిన మాటలు రమణదీక్షితులిని అన్నా!
  • బ్రాహ్మణుల ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలని కోరుకుంటా
  • విజయసాయిరెడ్డిని మరో రాష్ట్రంలో అయితే లోపల వేసేవాళ్లు

రమణ దీక్షితులను జైల్లో పెడితే అన్ని నిజాలు బయటకు వస్తాయంటూ ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో తీవ్ర విమర్శలు తలెత్తడంతో సోమిరెడ్డి స్పందించారు. రమణదీక్షితులపై తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని, క్షమాపణలు కోరుతున్నానని చెప్పారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, పొరపాటున విజయ సాయిరెడ్డిని అనాల్సిన మాటలు రమణదీక్షితులిని అన్నానని అన్నారు. సీఎం ఇంట్లో శ్రీవారి నగలు ఉన్నాయన్న సాయిరెడ్డి వ్యాఖ్యలు తనకు ఆగ్రహం తెప్పించాయని, ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని, బ్రాహ్మణుల ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలని కోరుకునే వ్యక్తిని తానని అన్నారు. తీవ్ర ఆరోపణలు చేసిన విజయసాయిరెడ్డిని మరో రాష్ట్రంలో అయితే లోపల వేసేవాళ్లని అన్నారు.

More Telugu News