Mehrin: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • యూకేలో గోపీచంద్ తో మెహ్రీన్ పాటలు  
  • రాంగోపాల్ వర్మ ఆధ్వర్యంలో ఫిలిం స్కూల్  
  • అంధుడి పాత్రలో యువ కథానాయకుడు  

*  యాక్షన్ హీరో గోపీచంద్ నటిస్తున్న 'పంతం' చిత్రానికి సంబంధించిన మూడు పాటల చిత్రీకరణ యూకేలో జరుగుతుంది. ఈ నెల 29 నుంచి వీటిని అక్కడ చిత్రీకరించడానికి యూనిట్ సిద్ధమవుతోంది. నూతన దర్శకుడు చక్రి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది.
*  సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ ఓ ఫిలిం స్కూల్ ప్రారంభిస్తున్నాడు. ఈ విషయాన్ని తాజాగా తనే ప్రకటించాడు. అమెరికాలోని కొందరి భాగస్వామ్యంతో ఈ స్కూల్ ను ప్రారంభిస్తున్నట్టు పేర్కొన్నాడు. అన్నట్టు, తన స్టయిల్లోనే దీనికి 'ఆర్జీవీ అన్ స్కూల్' అనే పేరు పెట్టాడు.
*  ఆది పినిశెట్టి అంధుడిగా చెఫ్ పాత్రలో నటిస్తున్నాడు. హరినాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'నీవెవరో' చిత్రంలో ఆది ఇలా అంధుడి పాత్రలో కనిపిస్తాడు. ఇందులో తాప్సి, రితికా సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.  

More Telugu News