Andhra Pradesh: నేను చెబుతున్నాను, టీడీపీ హండ్రెడ్ పర్సంట్ అధికారంలోకి రాదు: విష్ణుకుమార్ రాజు

  • పది నెలల తర్వాత టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఉండదు!
  • 2019లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం
  • చంద్రబాబు, ఆయన బృందం దారుణంగా మాట్లాడుతున్నారు
  • వారిది నోరా? పెంటకుప్పా?

టీడీపీపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విరుచుకుపడ్డారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ, ‘నేను చెబుతున్నాను, తెలుగుదేశం పార్టీ హండ్రెడ్ పర్సంట్ అధికారంలోకి రాదు.. డౌట్ లేదు. నేను వాస్తవాలే మాట్లాడతాను. నాకు జ్యోతిష్యం రాదు. నాకు లెక్కలు బాగా వచ్చు. తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీ, పవన్ కల్యాణ్ గారు సపోర్టు చేయడం వల్లే ఈరోజు అధికారంలో ఉంది.

గౌరవనీయుులైన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు, వారి బృందం కూడా బీజేపీ గురించి చాలా దారుణంగా మాట్లాడుతూ.. మోదీ గారిపై విమర్శలు చేస్తున్నారు. ఆ విధంగా మాట్లాడుతున్న వారిది నోరా? పెంటకుప్పా?  పది నెలల తర్వాత ఏపీలో టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఉండదు. 2019లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం’ అని జోస్యం చెెప్పారు.   

More Telugu News