prabhas: 'సాహో' తదుపరి షెడ్యూల్ కి రెడీ అవుతోన్న ప్రభాస్

  • ప్రభాస్ హీరోగా 'సాహో' 
  • 'అబుదాబి' షెడ్యూల్ పూర్తి 
  • వచ్చేనెలలో తదుపరి షెడ్యూల్  

ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో 'సాహో' సినిమా రూపొందుతోంది. శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, రీసెంట్ గా 'అబుదాబి'లో ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. 45 రోజుల పాటు జరిగిన ఈ మేజర్ షెడ్యూల్లో .. భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం ఖరీదైన కార్లు .. ట్రక్కులు ఉపయోగిస్తూ కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన ఈ సినిమా టీమ్, జూన్ 2వ వారంలో తదుపరి షెడ్యూల్ ను ప్లాన్ చేసింది. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ షెడ్యూల్ షూటింగు కొనసాగనుంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించనున్నారు.  

More Telugu News