tv: వేలూరులో టీవీ చానల్ కెమెరామెన్ దారుణ హత్య

  • కత్తితో పొడిచి చంపిన గంజాయి విక్రేతలు
  • పోలీసులకు సమాచారం అందించాడన్న కక్షతో హత్య
  • ఉదయం నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

ఓ తమిళ టీవీ చానల్ లో కెమెరామెన్ గా పని చేస్తున్న అశోక్ కుమార్ అనే వ్యక్తిని గంజాయి విక్రేతలు కత్తితో పొడిచి హత్య చేశారు. తమిళనాడులోని వేలూరు పాత టౌన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. రాత్రి నిద్రపోతున్న అతనిపై అదే ప్రాంతానికి చెందిన రమేష్, అగస్టిన్, తిరుమలై అనే వ్యక్తులు దాడి చేశారు. ప్రతిఘటించిన అశోక్ ను కత్తితో పొడిచి, పరారయ్యారు. ఈ సందర్భంగా స్థానికులు ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని వేలూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఉదయం నిందితులను అరెస్ట్ చేశారు.

రమేష్, అగస్టిన్, తిరుమలైలు గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారాన్ని పోలీసులకు అశోక్ అందించాడన్న కక్షతోనే వారు ఈ హత్యకు పాల్పడినట్టు తెలిసింది. తిరుమలై అనే వ్యక్తి ఇప్పటికే ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. జూదానికి సంబంధించిన గొడవలో ఓ ఆటోడ్రైవర్ ను బండతో మోది హత్య చేసిన కేసులో రెండు రోజుల క్రితమే జైలు నుంచి బయటకు వచ్చాడు.

More Telugu News