sanjay kishor: 'మహానటి' కోసం ఎంతో సహకరించాను .. కనీసం థ్యాంక్స్ కార్డు కూడా వేయలేదు!: సంజయ్ కిషోర్

  • 'మహానటి' మంచి ప్రయత్నం
  • సావిత్రికి సంబంధించిన మెటీరియల్ ఇచ్చాను
  • వాటిని నేను సంపాదించడానికి యేళ్లు పట్టింది

సావిత్రి వీరాభిమానిగా .. ఆమె పేరుతో ఎన్నో కార్యక్రమాలను నిర్వహించిన సినీ ప్రేమికుడిగా సంజయ్ కిషోర్ కనిపిస్తారు. అలాంటి ఆయన తాజాగా yoyo టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, 'మహానటి' సినిమాను గురించి ప్రస్తావించారు. "సావిత్రికి సంబంధించి ఎవరు ఎలాంటి ప్రయత్నాన్ని ప్రారంభించినా, అందుకు సంబంధించిన సమాచారం విషయంలో నా పేరు ప్రస్తావనకు వస్తుంటుంది.అలాగే నాగ్ అశ్విన్ తో పాటు ఆయన టీమ్ సభ్యులు వచ్చి నన్ను కలుసుకున్నారు. ఆమెకి సంబంధించి నా దగ్గరున్న మెటీరియల్ చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యారు. వాళ్లకి కావలసినవి తీసుకుని వెళ్లారు. ఇప్పుడు వాళ్లు ఎంతగా ప్రయత్నించినా అలాంటి మెటీరియల్ దొరకదు. నేను సంపాదించడానికే ఎన్నో యేళ్లు పట్టింది. ఇంత కష్టపడి సేకరించిన మెటీరియల్ తో వాళ్లకి సహకరిస్తే కనీసం థ్యాంక్స్ కార్డు కూడా వేయలేదు. ఆర్థికంగా నేనేం ఆశించలేదు .. థ్యాంక్స్ కార్డు వేసుంటే హ్యాపీగా వుండేది. ఏదేమైనా, వాళ్ల ప్రయత్నాన్ని అభినందిస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.   

More Telugu News