boat: ఏపీలో విషాదాన్ని నింపిన మరో పడవ ప్రమాదం

  • కృష్ణా నదిలో ప్రమాదం
  • చేపల వేటకు వెళ్లిన పడవను ఇసుక పడవ ఢీకొట్టిన వైనం
  • తల్లీ, కూతురు గల్లంతు

ఏపీలో ఈ ఉదయం మరో పడవ ప్రమాదం విషాదాన్ని నింపింది. గుంటూరు జిల్లాలో రెండు పడవలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. తుళ్లూరు మండలం బోరుపాలెం ఇసుక రీచ్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిని తల్లీకూతుర్లుగా గుర్తించారు.

 కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం నుంచి ఓ కుటుంబం చేపల వేట కోసం కృష్ణానదిలోకి వచ్చింది. ఈ సందర్భంగా ఇసుకను తరలిస్తున్న ఓ బోటు వీరి పడవను ఢీకింది. ఈ ప్రమాంలో తల్లీకూతురు నీటిలో మునిగిపోయారు. భర్త ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. మృతి చెందిన ఇద్దరినీ ఒడ్డుకు తీసుకువచ్చారు. వీరి మృత దేహాలను చూసి బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరోవైపు, ప్రమాదం ఎలా జరిగింది? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. 

More Telugu News