Chandrababu: రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడినందుకే నన్ను ఇలా చేస్తున్నారు: మోత్కుపల్లి ఆగ్రహం

  • నన్ను టీడీపీ నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు
  • నేను 30 ఏళ్లుగా టీడీపీ కోసం నిజాయతీగా పని చేస్తున్నాను
  • నాకు అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా అవమానపరుస్తున్నారు

తమ పార్టీలోంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడినందుకే తనను ఇలా చేస్తున్నారని టీటీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... తనను టీడీపీ నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

 తాను 30 ఏళ్లుగా టీడీపీ కోసం నిజాయతీగా పని చేస్తున్నానని, ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం తనతో 5 నిమిషాలు మాట్లాడడానికి కూడా ఒప్పుకోవట్లేదని, అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా అవమాన పరుస్తున్నారని అన్నారు. తాను చేసిన తప్పేంటని మోత్కుపల్లి ప్రశ్నించారు. తాను చంద్రబాబును నమ్మి చాలా కోల్పోయానని, దళితుడిని కాబట్టే తనను అవమాన పరుస్తున్నారని ఆరోపించారు.

More Telugu News