kumaraswamy: బలపరీక్షలో నెగ్గిన కుమారస్వామి.. కర్ణాటకలో కొలువుదీరనున్న సంకీర్ణ మంత్రివర్గం!

  • కర్ణాటక అసెంబ్లీలో ముగిసిన బలపరీక్ష
  • సభ నుంచి మధ్యలోనే వాకౌట్ చేసిన బీజేపీ
  • కుమారస్వామి బలపరీక్షలో నెగ్గినట్టు ప్రకటించిన స్పీకర్

కర్ణాటకలో కుమారస్వామి నేతృత్వంలో జేడీఎస్-కాంగ్రెస్ ల సంకీర్ణ కేబినెట్ కొలువుదీరనుంది. కాసేపటి క్రితం కర్ణాటక అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో కుమారస్వామి గెలుపొందారు. బలపరీక్షకు ముందే సభ నుంచి బీజేపీ సభ్యులు వాకౌట్ చేశారు. ఈ నేపథ్యంలో సభలో మిగిలిపోయిన జేడీఎస్, కాంగ్రెస్ సభ్యులంతా బలపరీక్షకు మద్దతుగా చేతులు ఎత్తారు. బలపరీక్షకు వ్యతిరేకంగా ఏ ఒక్కరూ చేతులు ఎత్తలేదు. దీంతో, బలపరీక్షలో కుమారస్వామి నెగ్గినట్టు స్పీకర్ మూడు సార్లు చదవి వినిపించారు. ఆ తర్వాత జాతీయగీతం ఆలాపనతో సభను స్పీకర్ ముగించారు. అనంతరం కాంగ్రెస్, జేడీఎస్ సభ్యులు ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు.

More Telugu News