Pawan Kalyan: కాసేపట్లో నిరాహార దీక్షకు దిగనున్న పవన్‌ కల్యాణ్‌

  • ఉద్ధానం కిడ్నీ బాధితులను ఆదుకోవాలని డిమాండ్‌
  • ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆగ్రహం
  • సాయంత్రం 5 నుంచి రేపు సాయంత్రం 5 గంటల వరకు దీక్ష

రెండు రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లా పలాసలో ఉద్ధానం కిడ్నీ బాధితులతో సమావేశమైన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేసిన విషయం తెలిసిందే. 48 గంటల్లో ప్రభుత్వం కిడ్నీ బాధితుల్ని ఆదుకోకపోతే నిరాహారదీక్షకు దిగుతానని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తన డిమాండ్‌పై పట్టించుకోకపోవడంతో ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి రేపు ఉదయం 9 గంటల వరకు శ్రీకాకుళంలో తాను బస చేస్తోన్న రిసార్టులోనే పవన్‌ నిరాహార దీక్ష చేస్తారని, రేపు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శ్రీకాకుళం పట్టణంలో ప్రజల మధ్యే పవన్‌ నిరాహార దీక్ష ఉంటుందని జనసేన ఉపాధ్యక్షుడు మహేందర్‌ రెడ్డి పేరిట ప్రకటన విడుదలైంది. నిజానికి పవన్‌ కల్యాణ్‌ నిన్నటి నుంచి ఘనాహారాన్ని తీసుకోవడం మానేశారని అందులో పేర్కొన్నారు.                                                                                                                      

More Telugu News