bjp: కుమారుడ్ని కోల్పోయిన దత్తాత్రేయ కుటుంబానికి ప్రధాని ఓదార్పు

  • తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిం చేసిందన్న ప్రధాని
  • దేశానికి సేవ చేయాల్సిన వైష్ణవ్ మృతి బాధాకరం
  • దత్తాత్రేయ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతూ లేఖ

ఒక్కగానొక్క కుమారుడ్ని కోల్పోయి తీవ్ర శోకంతో ఉన్న బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఓదార్చారు. ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్ (21) మూడు రోజుల క్రితం రాత్రి 10.40 గంటల సమయంలో కుటుంబ సభ్యులతో కలసి భోజనం చేస్తున్న సమయంలో, గుండెపోటు రావడంతో కుప్పకూలిన విషయం తెలిసిందే. అదే రోజు రాత్రి అతడు తుదిశ్వాస విడిచాడు. ఈ వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వైద్య విద్య పూర్తి చేసి దేశానికి సేవ చేయాల్సిన వైష్ణవ్ మృతి చెందడం బాధాకరమన్నారు. ఈ మేరకు దత్తాత్రేయ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతూ ప్రధాని మోదీ లేఖ పంపించారు. 

More Telugu News