Attili: టీడీపీకి రాజీనామా చేసిన ప.గో.జిల్లా నేత రంగరాజు... 27న వైకాపాలో చేరిక!

  • అత్తిలి మాజీ ఎమ్మెల్యే రంగరాజు
  • 2014 ఎన్నికల్లో టీడీపీ సమన్వయకర్తగా సేవలు
  • మద్దతుదారుల నుంచి ఒత్తిడితోనే వైకాపాలోకి
  • భీమవరంలో జగన్ సమక్షంలో చేరిక

పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ కీలక నేత, 2014 ఎన్నికల్లో ఆ పార్టీ ఎన్నికల సమన్వయకర్తగా పని చేసిన అత్తిలి మాజీ ఎమ్మెల్యే  చెరుకువాడ శ్రీరంగనాథరాజు (రంగరాజు) వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే టీడీపీకి రాజీనామా చేస్తూ, తన లేఖను చంద్రబాబుకు పంపిన ఆయన, ఈ నెల 27న భీమవరంలో వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు.

జిల్లా రైస్ మిల్లర్స్ అధ్యక్షుడిగా ఉన్న ఆయన, గతంలో అత్తిలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తొలుత కాంగ్రెస్ లో, ఆపై వైసీపీలో చేరిన ఆయన, ఆ తరువాత టీడీపీలో చేరారు. ఇప్పుడు తన మద్దతుదారుల ఒత్తిడితో వైసీపీలో చేరుతున్నానని వెల్లడించిన ఆయన, టీడీపీలో చంద్రబాబు తనకు సముచిత గౌరవాన్నే ఇచ్చారని చెప్పడం కొసమెరుపు.

More Telugu News