Andhra Pradesh: ఏపీకి రాయల్టీ బకాయిలను ముందుగానే విడుదల చేసిన కేంద్ర పెట్రోలియం శాఖ

  • రూ. 237.53 కోట్ల రాయల్టీ బకాయిలు విడుదల
  • ఉత్తర్వులను జారీ చేసిన కేంద్ర పెట్రోలియం శాఖ
  • సెప్టెంబర్, అక్టోబర్ లో రావాల్సిన బకాయిలు ముందుగానే విడుదల

కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి 2018-19 ఆర్థిక సంవత్సరంలో విడుదల చేయాల్సిన రాయల్టీ బకాయిలు రూ. 237.53 కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది.

ఈ వివరాలను ఏపీ భవన్ రెసిడెంట్ కమీషనర్ ప్రవీణ్ ప్రకాష్ తెలియజేశారు. రాష్ట్రానికి రావలసిన రాయల్టీ బకాయిలను ప్రతి ఏటా సెప్టెంబర్, అక్టోబర్ మాసాలలో విడుదల చేస్తుండగా... సంబంధిత కేంద్ర అధికారులతో చర్చిస్తూ నిరంతర పర్యవేక్షణ చేయటంతో, ఈ సంవత్సరం రాష్ట్రానికి రావలసిన బకాయిలను మే నెలలోనే విడుదల చేయడం జరిగిందని ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు.

More Telugu News