Vijayawada: ఈ నెల 30, 31 తేదీల్లో బ్యాంకుల సమ్మె

  • దేశంలోని అన్ని బ్యాంకుల ఉద్యోగ సంఘాలు సమ్మెకు దిగుతాయి
  • 48 గంటల నిరవధిక సమ్మె ఉంటుంది
  • రెండు శాతం వేతనాన్ని పెంచుతామనడంపై నిరసన 

బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేస్తున్న అవినీతిపరుల తీరుపై యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ నాయకులు మండిపడుతున్నారు. ఇలాంటి వ్యక్తుల కారణంగా బ్యాంకులు తీవ్రంగా నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యూనియన్ నాయకులు మాట్లాడుతూ, బ్యాంకు రుణాలు ఎగ్గొట్టే అవినీతిపరుల తీరును నిరసిస్తూ ఈ నెల 30, 31 తేదీల్లో దేశంలోని అన్ని బ్యాంకుల ఉద్యోగ సంఘాలు 48 గంటలపాటు నిరవధిక సమ్మెకు దిగుతున్నట్టు చెప్పారు.

ఈ సందర్భంగా ఉద్యోగులకు వేతన సవరణ గురించి వారు మాట్లాడుతూ, ఉద్యోగులను విభజించి చేస్తున్న పే సెటిల్మెంట్ కు తాము వ్యతిరేకమని అన్నారు. రెండు శాతం మాత్రమే చేశారని, పదిహేను శాతం వేతనాన్ని సవరణ చేయాల్సి ఉండగా బ్యాంకర్ల పరిస్థితి బాగోలేదని చెప్పడం దారుణమని అన్నారు. నీరవ్ మోదీ, విజయ్ మాల్యా వంటి వాళ్లు ఎగ్గొట్టిన రుణాలను ఆయా బ్యాంకులు మినహాయించి బ్యాంక్ కు వచ్చిన లాభాల్లో రెండు శాతం వేతనాన్ని పెంచుతామనడం సిగ్గుచేటని విమర్శించారు. 

More Telugu News