kamal: సావిత్రిగారు ప్యాలెస్ లో ఉండటం చూశాను .. చిన్న గదిలో ఉండటమూ చూశాను: కమలహాసన్

  • సావిత్రిగారితో కలిసి నటించాను 
  • నన్ను ఓ కొడుకులా చూసుకునేది 
  • ఆమె వైభవం చూస్తూ పెరిగినవాడిని నేను

తెలుగు తెరపై నవరసాలను నడిపించిన సావిత్రిని ఎవరూ మరిచిపోలేదు. అయితే 'మహానటి' సినిమా తరువాత ఆమె గురించి మాట్లాడుకోవడం ఎక్కువైంది. తెలుగుతో పాటు తమిళంలోను ఈ సినిమా విడుదలై మంచి ఆదరణ పొందింది. ఈ నేపథ్యంలో సావిత్రిగారితో తనకి గల అనుబంధం గురించి కమల్ ప్రస్తావించారు. "బాల నటుడిగా నేను సావిత్రి గారితో కలిసి చాలా సినిమాల్లో నటించాను. ఆమె నన్ను ఓ దత్త పుత్రిడిలా ఎంతో ప్రేమగా చూసుకునేది. సావిత్రి గారికి ఇష్టమైన కిళ్లీ కట్టించుకురావడానికి ఇంపాలా కార్లు వెళ్లేవి .. అలాంటి సావిత్రి గారు ఆ తరువాత టాక్సీ కోసం రోడ్డు పక్కన వెయిట్ చేస్తుండటం చూశాను. సావిత్రి గారి బంగ్లా నాకు బాగా తెలుసు .. అది ఓ ప్యాలెస్ లా ఉండేది. నేను నిర్మాతగా మారిన తరువాత ఆమెను కలవాలనుకున్నాను. మా మేనేజర్ నన్ను ఆ బంగ్లాకి కాకుండా ఓ చిన్న గదికి తీసుకెళ్లాడు. అక్కడ సావిత్రి గారిని చూసి నేను తట్టుకోలేకపోయాను .. కన్నీళ్లు ఆపుకోలేకపోయాను" అంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు.   

More Telugu News