actress kavitha: టీటీడీ ఉద్యోగుల తీరుపై సినీ నటి కవిత ఆక్షేపణ

  • ఆలయం పరువు తీస్తున్నారు
  • నల్లబ్యాడ్జీలు ధరించడమేంటి?
  • ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని  డిమాండ్

టీటీడీ ఉద్యోగుల తీరును సినీ నటి కవిత తప్పుబట్టారు. తిరుమల వచ్చిన ఆమె టీటీడీ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి కనిపించడంతో తీవ్రంగా స్పందించారు. ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించడమేంటని ప్రశ్నిస్తూనే ఇది తనకు బాధ కలిగించిందన్నారు. ఆలయం పరువు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు అధికారుల జోక్యంపై, కొన్ని ఆభరణాలు మాయం కావడంపై వివర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలకు వ్యతిరేకంగా నల్లబ్యాడ్జీలు ధరించి మూడు రోజుల పాటు నిరసన తెలియజేయాలని టీటీడీ ఉద్యోగులు నిర్ణయం తీసుకున్నారు.

More Telugu News