Chandrababu: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో చంద్రబాబు భేటీ

  • బెంగళూరులో సమావేశమైన చంద్రబాబు, కేజ్రీవాల్
  • ప్రాంతీయ పార్టీల బలోపేతంపై భేటీలో చర్చించిన నేతలు
  • ఏపీలో పరిణామాలను వివరించిన చంద్రబాబు

కర్ణాటక ముఖ్యమంత్రిగా జేడీఎస్‌ నేత కుమారస్వామి ప్రమాణం స్వీకారం చేస్తున్న నేపథ్యంలో బెంగళూరుకి వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో భేటీ అయ్యారు. ప్రాంతీయ పార్టీల బలోపేతంపై భేటీలో చర్చించారు. ఏపీలో పరిణామాలు, బీజేపీ చేస్తోన్న రాజకీయాలను కేజ్రీవాల్‌కి చంద్రబాబు నాయుడు వివరించారు.

ఏపీ హక్కులను కేంద్ర ప్రభుత్వం ఎలా కాలరాస్తోందనే విషయాన్ని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. దేశాభివృద్ధి కోసం ప్రాంతీయ పార్టీలన్ని కలిసి పని చేయాలని ఇరు నేతలు అభిప్రాయపడ్డారు. తన బెంగళూరు పర్యటనను ఇతర రాజకీయ పార్టీలను ఏకం చేసేందుకు అవకాశంగా మలుచుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు.        

More Telugu News