IPL: ఐపీఎల్ కప్పు చెన్నైకే... సాక్ష్యాలు చూపుతూ జోస్యం చెప్పిన క్రికెటర్ మహమ్మద్ కైఫ్!

  • ఢిల్లీ చివరి స్థానంలో ఉన్నప్పుడెల్లా టాప్-2 జట్టుకు కప్పు
  • గతంలో మూడు సార్లు నిజమైందన్న కైఫ్
  • ఆ ప్రకారం చెన్నైదే గెలుపని వ్యాఖ్య

ఐపీఎల్ 2018 విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ నిలవనుందని క్రికెటర్ మహమ్మద్ కైఫ్ జోస్యం చెబుతున్నాడు. తన జోస్యానికి మద్దతిచ్చే సాక్ష్యాలను కూడా ఆయన చూపిస్తుండటం గమనార్హం. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టిన ఆయన, గడచిన ఐపీఎల్ 10 సీజన్లలో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచిన ప్రతిసారీ, టాప్-2గా ఉన్న జట్టు కప్పును గెలిచిందని అన్నాడు.

2011, 2013, 2014 సంవత్సరాల్లో ఢిల్లీ జట్టు 8వ స్థానంలో ఉందని గుర్తు చేస్తూ, ఆయా సంవత్సరాల్లో టాప్-2లో ఉన్న జట్లు చెన్నై సూపర్ కింగ్స్ (2011), ముంబై ఇండియన్స్ (2013), కోల్ కతా నైట్ రైడర్స్ (2014) విజయం సాధించాయని గుర్తు చేశాడు. అదే రిపీటవుతుందని, ఆ కారణంగానే చెన్నై ఈ ఏటి విజేతగా నిలుస్తుందని అంటున్నాడు కైఫ్. చైన్నై గెలిస్తే, తనకు సంతోషమేనని చెప్పాడు.

More Telugu News