Karnataka: కర్ణాటక జయనగర్ ఎన్నిక.. బీజేపీ అభ్యర్థిగా బీఎన్ ప్రహ్లాద్

  • జూన్ 11న జయనగర్ నియోజకవర్గంలో ఎన్నిక
  • విజయకుమార్ సోదరుడు బీఎన్ ప్రహ్లాద్ పేరు ప్రకటన
  • ఈ మేరకు అధిష్ఠానం ఆదేశాలు

ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సమయంలో జయనగర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి బీఎన్ విజయకుమార్ గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో వాయిదా పడిన ఈ నియోజక వర్గం ఎన్నిక జూన్ 11న ఎన్నిక  జరగనుంది. ఈ నేపథ్యంలో తమ అభ్యర్థి పేరును బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. ఈ స్థానం నుంచి విజయకుమార్ సోదరుడు బీఎన్ ప్రహ్లాద్ పేరును ప్రకటించింది. కాగా, కర్ణాటక సీఎం కుమారస్వామిగౌడ, డిప్యూటీ సీఎంగా పరమేశ్వర్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

More Telugu News