West Godavari District: ప.గో.జిల్లాలో రోడ్డు ప్రమాదంలో యువతి మృతి... తట్టుకోలేక యువకుడి ఆత్మహత్య!

  • ప.గో జిల్లాలో విషాద ఘటన
  • ద్విచక్ర వాహనాన్ని ఢీ కొన్న లారీ
  • మార్కొండపాడుకు చెందిన యువతీయువకులు

పశ్చిమ గోదావరి జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. తణుకు నుంచి రోడ్డు మార్గంలో ఓ అమ్మాయి, అబ్బాయి వెళుతోన్న ద్విచక్రవాహనాన్ని ఒక్కసారిగా లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తోన్న సదరు యువతికి తీవ్రగాయాలు కాగా, యువకుడికి స్వల్పగాయాలయ్యాయి.

అయితే, ఆ యువతిని ఆసుపత్రికి తరలించేలోగా ప్రాణాలు కోల్పోయింది. దీంతో మనస్తాపానికి గురైన యువకుడు.. యువతి మృతిని భరించలేక రైల్వే ట్రాకు వైపునకు వెళ్లి రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. బాధితులిద్దరూ చాగల్లు మండలం మార్కొండపాడుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.

More Telugu News