Karnataka: దేవెగౌడ నివాసానికి చేరుకున్న సీఎం కేసీఆర్

  • కేసీఆర్ కు స్వాగతం పలికిన దేవెగౌడ, కుమారస్వామిగౌడ 
  • సీఎం కానున్న కుమారస్వామికి అభినందనలు తెలిపిన కేసీఆర్
  • కేసీఆర్ వెంట స్పీకర్ మధుసూదనాచారి, ఎంపీ కేకే

జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ నివాసానికి తెలంగాణ సీఎం కేసీఆర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు దేవెగౌడ, కుమారస్వామిగౌడ ఘనస్వాగతం పలికారు. పరస్పరం పలకరించుకున్నారు. కర్ణాటక సీఎంగా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న కుమారస్వామిగౌడను కేసీఆర్ అభినందించారు.

కాగా, రేపటి ప్రమాణస్వీకార కార్యక్రమానికి కేసీఆర్ హాజరుకాలేకపోతున్నందు వల్ల ఈరోజు కుమారస్వామిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ కు రేపు అత్యవసర సమావేశాలు ఉన్న దృష్ట్యా ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొనడం వీలుకాదు. అందుకని, ఈరోజే వెళ్లి కుమారస్వామిని అభినందించినట్టు సమాచారం. కేసీఆర్ తో పాటు స్పీకర్ మధుసూదనాచారి, ఎంపీ కేకే ఉన్నారు.

More Telugu News