anchor anasuya: లేహ్, లడక్ ప్రాంతాలు ఎంత అందంగా ఉన్నాయి!: యాంకర్ అనసూయ

  • ఏడాదికోసారి భారత్ లోని పలు ప్రాంతాల్లో పర్యటించాలని నిర్ణయించుకున్నా
  • భారత్ లోని సంస్కృతీ సంప్రదాయాలను చూసి గర్వపడుతున్నా
  • ఐ లవ్ ఇండియా

మండే ఎండలకు దూరంగా..చల్లని ప్రాంతాల్లో పర్యటిస్తున్న ప్రముఖ యాంకర్, నటి అనసూయ దంపతులు ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు. జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని లేహ్, లడక్ ప్రాంతాల్లో సరదాగా గడుపుతున్నారు. ఈ విషయాన్ని అనసూయ స్వయంగా తెలిపింది.

‘లేహ్, లడక్ ప్రాంత్రాలు!! అవి ఎంత అందంగా ఉన్నాయి!!! జీవితానుభవం!!! ఏడాదికోసారి భారత్ లోని పలు ప్రాంతాల్లో పర్యటించాలని కచ్చితంగా నిర్ణయించుకున్నా. ఇన్ క్రెడిబుల్ ఇండియాలోని వనరులను, సంస్కృతీ సంప్రదాయాలను, భిన్నత్వంలో ఏకత్వాన్ని చూసి గర్వపడుతున్నా. ఐ లవ్ ఇండియా’ అని అనసూయ సంతోషం వ్యక్తం చేసింది. తన భర్త, పిల్లలతో కలిసి దిగిన ఫొటోలను అనసూయ పోస్ట్ చేసింది. ఈ ఫొటోలతో పాటు తాము పర్యటించిన ప్రాంతాలకు చెందిన ఓ చిన్నారి ఫొటోను కూడా జతపరిచింది.

More Telugu News