tamanna: 'అల్లరి అల్లుడు' లోని హిట్ సాంగ్ రీమిక్స్ లో తమన్నా

  • 'సవ్యసాచి'గా నాగచైతన్య 
  • కథానాయికగా నిధి అగర్వాల్ 
  • స్పెషల్ సాంగ్ కోసం తమన్నా 

నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో 'సవ్యసాచి' సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను పూర్తిచేసుకుంది. ఈ సినిమా కోసం ఒక సాంగ్ ను రీమిక్స్  చేయనున్నారు. గతంలో నాగార్జున చేసిన సినిమాల్లో 'అల్లరి అల్లుడు' కి ప్రత్యేకమైన స్థానం వుంది. ఈ సినిమాలో 'నిన్ను రోడ్డు మీద చూసినది లగాయతు' అనే సాంగ్ కుర్రకారును ఒక ఊపు ఊపేసింది.

కీరవాణి స్వరపరిచిన ఆ సాంగ్ ను ఇప్పుడు 'సవ్యసాచి' కోసం ఆయనే రీమిక్స్ చేయనుండటం విశేషం. ఈ సాంగ్ ను స్టార్ హీరోయిన్ పై చేస్తేనే బాగుంటుందని భావించి కొంతమంది పేర్లను పరిశీలించారు. చివరికి తమన్నాను ఖాయం చేశారనేది తాజా సమాచారం. గతంలో తమన్నా చేసిన స్పెషల్ సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందువలన ఆమెనే ఈ స్పెషల్ సాంగ్ కోసం తీసుకున్నారట. ఇందుకోసం తమన్నాకి పెద్దమొత్తమే ముట్టిందని చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో కథానాయికగా నిధి అగర్వాల్ చేస్తోన్న సంగతి తెలిసిందే.   

More Telugu News