Chandrababu: రేపు ఉదయం బెంగుళూరుకు వెళ్తున్న చంద్రబాబు.. రాహుల్ తో వేదిక పంచుకుంటారా?

  • కుమారస్వామి ప్రమాణస్వీకారానికి వెళ్తున్న చంద్రబాబు
  • కార్యక్రమానికి హాజరవుతున్న పలు ప్రాంతీయ పార్టీల అధినేతలు
  • ఒకే వేదికపై చంద్రబాబు, రాహుల్ గాంధీ?

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు ఉదయం బెంగుళూరుకు వెళ్తున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. విజయవాడ నుంచి బెంగళూరుకు విమానంలో వెళ్తున్న ఆయన... రేపు రాత్రి మళ్లీ తిరిగివస్తారు.

ఈ కార్యక్రమానికి దేశంలోని పలు ప్రాంతీయ పార్టీల అధినేతలు హాజరుకానున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. దీంతో, వీరిద్దరూ ఒకే వేదికను పంచుకోబోతుండటం ఆసక్తికరంగా మారింది. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సాయంత్రం బెంగళూరుకు వెళ్లి, మళ్లీ రాత్రికి హైదరాబాదుకు తిరిగిరానున్నారు. 

More Telugu News