AIRTEL: ఎయిర్ టెల్ అదిరిపోయే ఆఫర్... రూ.558కే రోజూ 3జీబీ డేటా

  • 82 రోజుల పాటు వ్యాలిడిటీ
  • ఉచిత కాల్స్, రోజూ ఉచితంగా 100 ఎస్ఎంఎస్ లు
  • రూ.498కి జియో రోజూ 2జీబీ డేటా

ప్రత్యర్థి జియోకు గట్టి పోటీనిచ్చే ప్రీపెయిడ్ ప్లాన్ ను ఎయిర్ టెల్ తీసుకొచ్చింది. రూ.558తో రీచార్జ్ చేసుకున్న వారికి 82 రోజుల పాటు ప్రతి రోజూ 3 జీబీ డేటాను ఆఫర్ చేస్తోంది. దీనికి తోడు దేశవ్యాప్తంగా అన్ని కాల్స్ ఉచితంగా మాట్లాడుకునే అవకాశం, రోజూ 100 ఎస్ఎంఎస్ లు ఉచితంగా పంపుకునేందుకు వీలు కల్పించింది.

ప్రస్తుతానికి ఢిల్లీ సర్కిల్ లో మాత్రమే ఈ ప్లాన్ ను ప్రారంభించగా, త్వరలో దేశవ్యాప్తంగా అన్ని సర్కిళ్లలోనూ ఈ ప్లాన్ ను కంపెనీ తీసుకురానుంది. రిలయన్స్ జియో రూ.498 రీచార్జ్ పై 91 రోజుల వ్యాలిడిటీతో, ప్రతీ రోజూ 2జీబీ డేటాను ఆఫర్ చేస్తోంది. దీనికంటే ఎయిర్ టెల్ ఒక జీబీ డేటాను అదనంగా అందిస్తోంది. కస్టమర్లను సొంతం చేసుకునేందుకు టెలికం కంపెనీలు తీవ్ర స్థాయిలో పోటీ పడుతున్న వాతావరణం చూస్తూనే ఉన్నాం. 

More Telugu News