IPL: ఫైనల్ నీదా? నాదా?.. సై అంటున్న హైదరాబాద్, చెన్నై జట్లు

  • నేడు క్వాలిఫయర్ పోరు
  • బౌలర్లే అండగా రెచ్చిపోనున్న సన్ రైజర్స్ హైదరాబాద్
  • ఆల్ రౌండ్ ప్రతిభతో చెన్నై సూపర్ కింగ్స్

ఈ సీజన్ ఐపీఎల్ పోరు తుది అంకానికి చేరింది. నేటి నుంచి ఫైనల్ లో బెర్తు కోసం నాలుగు జట్ల మధ్య పోటీలు జరగనున్నాయి. నేడు క్వాలిఫయర్ మ్యాచ్, ముంబైలోని వాంఖడే స్డేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య రాత్రి 7 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో గెలిచే జట్టు నేరుగా ఫైనల్స్ కు చేరనుండగా, ఆపై రేపు రాజస్థాన్ రాయల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచే జట్టుతో నేడు ఓడిపోయే జట్టు పోటీ పడుతుంది.

ఇక ఈ సీజన్ లో మంచి బ్యాటింగ్ లైనప్, ఆల్ రౌండర్లతో బలంగా కనిపిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు, తక్కువ స్కోరు చేసినా కూడా దాన్ని కాపాడుకునే సత్తా ఉన్న బౌలర్లను కలిగివున్న హైదరాబాద్ జట్టు ఈ మ్యాచ్ లో హోరాహోరీ తలపడేందుకు తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోని అంబటి రాయుడిని సాధ్యమైనంత త్వరగా అడ్డుకోగలిగే పనిని భువనేశ్వర్, సందీప్ లకు హైదరాబాద్ జట్టు అప్పగించింది. ఈ మ్యాచ్ లో చెన్నై ఆటగాళ్లకు ఎంత తొందరగా హైదరాబాద్ బౌలర్లు కళ్లెం వేయగలరన్న విషయంపైనే హైదరాబాద్ జట్టు విజయం ఆధారపడి వుండగా, టాప్ ఆర్డర్ తో పాటు దిగువన వచ్చే ఆటగాళ్లు సైతం పరుగులు సాధిస్తుండటం చెన్నైకి కలిసొచ్చే అంశం.

More Telugu News