amit shah: కర్ణాటకలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే హక్కు మాకు ఉంది: అమిత్ షా

  • కర్ణాటకలో ఎక్కువ స్థానాలను గెలుపొందింది బీజేపీనే
  • ఓటర్లు ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీని ఇవ్వలేదు
  • కర్ణాటకలో బీజేపీ ఓట్ గ్రాఫ్ పెరిగింది

కర్ణాటకలో ఎక్కువ స్థానాలను గెలుచుకున్న బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే హక్కు ఉందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ఓటర్లు ఎవరికీ స్పష్టమైన మెజార్టీని ఇవ్వలేదని... ఈ నేపథ్యంలో మరోసారి ఎన్నికలను నిర్వహించాలని అన్నారు. జేడీఎస్, కాంగ్రెస్ పార్టీల కలయికపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. ప్రజాతీర్పు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉందని తెలిపారు. కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు విసుగెత్తిపోయారని చెప్పారు. కులం, మతం కార్డులతో ఓటర్లను ఆ పార్టీ ప్రలోభపెట్టిందని... అన్ని రకాలుగా నిబంధనలను ఉల్లంఘించిందని విమర్శించారు. కర్ణాటకలో తమ ఓట్ గ్రాఫ్ పెరిగిందని సంతోషం వ్యక్తం చేశారు.

More Telugu News