Uttar Pradesh: 'అలా చేస్తే మీకు వ్యాధి సోకుగాక'.. శాపం పెట్టి హెచ్చరించిన యూపీ మంత్రి

  • రాజకీయ ప్రత్యర్థుల ర్యాలీకి వెళ్లకూడదు
  • వెళితే జాండిస్‌ సోకుతుంది
  • నేను మందిస్తేనే ఆ వ్యాధి నయమవుతుంది
  • ఓం ప్రకాశ్‌ రాజ్భర్‌ విచిత్ర వ్యాఖ్యలు

పదే పదే వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ఉత్తరప్రదేశ్‌ మంత్రి, సుహెల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ అధినేత ఓం ప్రకాశ్‌ రాజ్భర్‌ తాజాగా మాట్లాడుతూ తన ఆజ్ఙలను పాటించకపోతే వ్యాధి వస్తుందంటూ ప్రజలను హెచ్చరించి మరోసారి వార్తల్లోకెక్కారు. తన మనుషులు వచ్చి పిలిస్తేనే ర్యాలీల్లో పాల్గొనాలని, తన మాటను కాదని తన రాజకీయ ప్రత్యర్థుల ర్యాలీలో పాల్గొనేందుకు వెళితే జాండీస్‌ సోకుతుందని, జాగ్రత్తగా ఉండాలని, ఇదే తన శాపమని వ్యాఖ్యానించారు.

అంతేకాదు, అలా సోకిన వ్యాధికి తాను మందిస్తేనే నయం అవుతుందని అన్నారు. అలాగే, యూపీ మంత్రివర్గంలో ఉన్నప్పటికీ బీజేపీకి వ్యతిరేకంగా పలు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ గుజరాత్‌ మోడల్‌ను యూపీలో ప్రవేశపెడతామని చెప్పారని, ఇప్పటికీ అది నెరవేర్చలేదని విమర్శించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఓం ప్రకాశ్‌ రాజ్భర్‌పై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News