Tirumala: రమణదీక్షితులను తొలగించడం సబబు కాదు: మల్లాది విష్ణు

  • టీడీపీ ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనం ఈ సంఘటన
  • టీడీపీ సర్కార్ తమ తప్పు దిద్దుకోకపోతే ఉద్యమిస్తాం
  • రమణదీక్షితులు చేసిన ఆరోపణలపై దృష్టి సారించారు

టీటీడీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులను తొలగించడంపై ఏపీ వైసీపీ నేత మల్లాది విష్ణు స్పందించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ సంఘటన టీడీపీ ప్రభుత్వం నిరంకుశత్వానికి నిదర్శనమని ఆరోపించారు. ఈ విషయంలో టీడీపీ ప్రభుత్వం తమ తప్పు దిద్దుకోకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు.

రమణదీక్షితులు చేసిన ఆరోపణలపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. కాగా, తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని రమణదీక్షితులు అంటున్నారు. ఈ విషయాలపై సీబీఐతో విచారణ జరిపిస్తే అన్ని విషయాలు బయటపడతాయని అంటున్నారు.

More Telugu News