prabhas: 'సాహో' ఛేజింగ్ కోసం 37 కార్లు .. 4 భారీ ట్రక్కులు!

  • 'అబుదాబి'లో 'సాహో' షూటింగ్
  • భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణ 
  • ప్రభాస్ జోడీగా శ్రద్దా కపూర్  

ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో 'సాహో' సినిమా రూపొందుతోంది. సుజీత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, ప్రస్తుతం 'అబుదాబి'లో షూటింగు జరుపుకుంటోంది. హాలీవుడ్ యాక్షన్ మూవీస్ లో కనిపించే తరహాలో యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారు. అందులో భాగంగా భారీ ఛేజింగ్ సీన్ ఒకటి రీసెంట్ గా చిత్రీకరించారు. ఈ ఛేజింగ్ సీన్ కోసం 37 ఖరీదైన కార్లను .. 4 భారీ ట్రక్కులను ఉపయోగించారు. ఛేజింగ్ లో కార్లు .. ట్రక్కులు ఒకదానికొకటి ఢీ కొడుతూ ధ్వంసమవుతూ ఉంటాయి. దీనిని బట్టి ఈ సినిమా కోసం ఏ స్థాయిలో ఖర్చు చేస్తున్నారన్నది అర్థం  చేసుకోవచ్చు. ఈ ఎపిసోడ్ లో బైక్ పై ప్రభాస్ చేసే విన్యాసాలు చూసి తీరవలసిందేనని అంటున్నారు. తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లో విడుదలయ్యే ఈ సినిమాలో కథానాయికగా శ్రద్ధా కపూర్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.      

More Telugu News