Hyderabad: పాతబస్తీలో దారుణం.. మహిళను హత్య చేసి ప్యాక్ చేశారు!

  • దారుణానికి పాల్పడ్డ గుర్తుతెలియని వ్యక్తులు
  • హతురాలికి బురఖా తొడిగి ప్లాస్టిక్ బ్యాగ్ లో ఉంచారు
  • ఆపై ఆ బ్యాగ్ ని బియ్యపు సంచిలో పెట్టిన వైనం

హైదరాబాద్ పాతబస్తీలో మహిళను దారుణంగా హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ప్యాక్ చేసి రైల్వేట్రాక్ పక్కన పడేశారు. డబీర్ పూర్ స్టేషన్ కు కొంచెం దూరంలో ఈ మృతదేహాం ఉన్న ప్యాక్ ను ఉంచారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.. మహిళను హత్య చేసి.. ఆ శరీరానికి బురఖా వేసి ప్లాస్టిక్ బ్యాగ్ లో ఉంచారు. ఆపై ఆ బ్యాగ్ ని బియ్యపు సంచిలో పెట్టారు. సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా, మహిళ హత్యకు గురై రెండు రోజులైందని, గుర్తుతెలియని వ్యక్తులు పక్కా పథకంతోనే ఈ దారుణానికి ఒడిగట్టారని పోలీసులు పేర్కొన్నారు.  

More Telugu News