Karnataka: ప్రొటెం స్పీకర్ నియామకాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు జేడీఎస్

  • ప్రొటెం స్పీకర్ గా బోపయ్య నియామకం తగదు
  • గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేసిన జేడీఎస్
  • సీనియర్ ఎమ్మెల్యేలను కాదని బోపయ్యను ఎలా నియమిస్తారు? 

కర్ణాటక అసెంబ్లీ ప్రొటెమ్ స్పీకర్ గా బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే బోపయ్యను ఎంపిక చేయడంపై జేడీఎస్ నేతలు మండిపడుతున్నారు. ప్రొటెం స్పీకర్ గా బోపయ్యను నియమిస్తూ గవర్నర్ ఆదేశాలు జారీ చేయడాన్ని తప్పుబడుతున్నారు. గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జేడీఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

సీనియర్ ఎమ్మెల్యేలను కాదని బోపయ్యను ఎలా నియమిస్తారంటూ తమ పిటిషన్ లో ప్రశ్నించారు. కాగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత దేశ్ పాండే ఇప్పటివరకు 8 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దేశ్ పాండేను కాదని బోపయ్యను ప్రొటెం స్పీకర్ గా నియమించడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News