nithin: సెంటిమెంట్ పక్కకి పెట్టిన దిల్ రాజు .. ముగింపు దిశగా 'శ్రీనివాస కల్యాణం'

  • దిల్ రాజు నిర్మాతగా 'శ్రీనివాస కల్యాణం'
  • తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో 
  • ఆగస్టు 9వ తేదీన విడుదల    

దిల్ రాజు నిర్మాతగా .. సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో 'శ్రీనివాస కల్యాణం' రూపొందుతోంది. నితిన్ .. రాశిఖన్నా జంటగా నటిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఈ రోజు నుంచి ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలవుతోంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను 10 రోజుల పాటు చిత్రీకరించనున్నారు.

ఆ తరువాత షెడ్యూల్ అమలాపురంలో జరగనుంది. ఈ షెడ్యూల్ తో ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తవుతుంది. దిల్ రాజు నిర్మాణంలో క్రితం ఏడాది జూలై 21వ తేదీన వచ్చిన 'ఫిదా' ఘన విజయాన్ని సాధించింది. అందువలన ఆ సెంటిమెంట్ తో అదే రోజున 'శ్రీనివాస కల్యాణం'ను విడుదల చేయాలని భావించారు. కానీ కొన్ని కారణాల వలన ఆయన ఆ సెంటిమెంట్ ను పక్కన పెట్టేసి, ఆగస్టు 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.  

More Telugu News