sanjay misra: తీవ్ర విషాదంతో ఇంట్లోంచి వెళ్లి ఓ దాబాలో పనిచేశాను.. అందరూ నన్ను గుర్తుపట్టారు: సినీ నటుడు సంజయ్ మిశ్రా

  • నా తండ్రి మరణంతో కుంగిపోయాను
  • నన్ను తాగుడు మానేయమన్నారు
  • ఆయన చివరికోరిక తీర్చాలని నిర్ణయించుకున్నాను
  • రిషికేష్‌ వెళ్లాను

గతంలో తాను తన తండ్రి మరణంతో తీవ్ర విషాదాన్ని అనుభవించానని, తన జీవితంలో ఎన్నడూ లేని విధంగా ప్రతికూల పరిస్థితులు తనను చుట్టుముట్టాయని బాలీవుడ్‌ నటుడు సంజయ్ మిశ్రా అన్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... తన తండ్రి చివరి కోరిక ప్రకారం తాను ధూమ, మద్యపానాలను పూర్తిగా మానేయాలని అనుకొన్నానని, అయితే, తానున్న పరిస్థితుల్లో అది సాధ్యం కాదని భావించి ఒంటరిగా, చేతిలో నయాపైసా లేకుండా రుషికేష్‌కు వెళ్లానని చెప్పారు.

అక్కడ ఓ దాబాలో ఉద్యోగంలో చేరానని అన్నారు. అయితే, అక్కడ కూడా దురదృష్టమే ఎదురైందని, తాను నటించిన సినిమాలు గోల్‌మాల్, ధమాల్‌లను చూసిన జనం అందరూ తనను గుర్తించారని అన్నారు. తనతో వారంతా మాట్లాడటం మొదలు పెట్టడంతో ఆ దాబా యజమాని తనను ఉద్యోగం నుంచి తీసేశాడని తెలిపారు. మళ్లీ సినిమాల్లో నటించడానికి వచ్చానని చెప్పారు.

More Telugu News