BJP: యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేస్తారంటూ ట్వీట్‌.. దుమారం.. తొలగించిన బీజేపీ

  • ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆహ్వానించినట్లు వార్తలు 
  • మండిపడ్డ కాంగ్రెస్‌ నేతలు
  • బీజేపీ ట్వీట్‌ వల్లే దేశ వ్యాప్తంగా ప్రచారం?

కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ నేత యడ్యూరప్పను ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆహ్వానించినట్లు వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. గవర్నర్‌ నుంచి అధికారికంగా ప్రకటన రాక ముందే.. రేపు ఉదయం 9.30కి ప్రమాణ స్వీకారం కూడా చేస్తారని ప్రచారం జరుగుతోంది.

కొద్ది సేపటి క్రితం బీజేపీ కర్ణాటక అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో ఆ పార్టీ ఓ ట్వీట్‌ చేసింది. యడ్యూరప్ప రేపు ఉదయం ప్రమాణ స్వీకారం చేస్తారని అందులో ఉంది. అయితే, ఈ విషయం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడంతో బీజేపీ ఆ ట్వీట్‌ ను తొలగించింది. అయితే, ఈ వార్తపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. 

More Telugu News