Karnataka: గవర్నర్ ఆహ్వానం.. కర్ణాటక సీఎంగా రేపు బీజేపీ నేత యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం?

  • ప్రభుత్వ ఏర్పాటుకు యడ్యూరప్పను ఆహ్వానించిన గవర్నర్‌
  • రేపు ఉదయం 9.30 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం
  • 10 రోజుల్లోగా బలాన్ని నిరూపించుకోవాలని ఆదేశం 

కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా బీజేపీ నేత బీఎస్‌ యడ్యూరప్పను ఆ రాష్ట్ర గవర్నర్‌ వజుభాయ్‌ వాలా ఆహ్వానించినట్లు తాజా సమాచారం. రేపు ఉదయం 9.30 గంటలకు రాజ్‌భవన్‌ ప్రాంగణంలోనే యడ్యూరప్ప సీఎంగా ప్రమాణం చేయనున్నారు. అనంతరం యడ్యూరప్ప 10 రోజుల్లోగా బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్‌ సూచించినట్లు సమాచారం. అయితే, ఈ విషయంపై అధికారికంగా రాజ్‌భవన్‌ నుంచి ప్రకటన రావాల్సి ఉంది.
 

More Telugu News