Congress: మొదలైన క్యాంపు రాజకీయాలు... బస్సులో బెంగళూరులోని రిసార్ట్‌కు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల తరలింపు

  • కర్ణాటకలో ఎమ్మెల్యేల బేరసారాలు
  • కాపాడుకునేందుకు ఆయా పార్టీల అధిష్ఠానాల తంటాలు
  • ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు

నిన్న వెల్లడైన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లభించకపోవడంతో హంగ్‌ ఏర్పడిన విషయం తెలిసిందే. 104 మంది ఎమ్మెల్యేలతో పాటు మరికొందరు తమ వైపే ఉన్నారని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప ఆ రాష్ట్ర గవర్నర్‌ని కలిసి చెప్పగా, తమకు 117 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, తమకే అవకాశం ఇవ్వాలని జేడీఎస్‌-కాంగ్రెస్‌ నేతలు ఇప్పటికే గవర్నర్‌కు లేఖ సమర్పించారు.

ఈ నేపథ్యంలో కర్ణాటకలో ఎమ్మెల్యేల బేరసారాలు కొనసాగుతున్నాయని తెలుస్తోంది. ఇప్పటి వరకు తమ వెంట ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు జేడీఎస్‌-కాంగ్రెస్‌, బీజేపీ నానా తంటాలు పడుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం తమ ఎమ్మెల్యేలను బస్సులో బెంగళూరులోని ఓ రిసార్ట్‌కు తరలిస్తోంది.

More Telugu News