Chandrababu: లాంచీ ప్రమాద బాధిత కుటుంబాలను ఓదార్చిన చంద్రబాబు

  • ప్రమాదస్థలికి వెళ్లిన ముఖ్యమంత్రి
  • సహాయక చర్యలను పర్యవేక్షించిన సీఎం
  • లాంచీని ఒడ్డుకు తీసుకొచ్చిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది

తూర్పుగోదావరి జిల్లాలో లాంచీ మునిగిపోయిన ప్రమాద స్థలికి ముఖ్యమంత్రి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను ఆయన పర్యవేక్షించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. మరో లాంచీ ఎక్కి గోదావరిలో ప్రమాద స్థలిని పరిశీలించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబసభ్యులను ఆయన ఓదార్చారు. నిన్న సాయంత్రం వాడపల్లి-మంటూరు మధ్యలో లాంచీ ప్రమాదానికి గురయిన సంగతి తెలిసిందే. దాదాపు 40 అడుగుల లోతున లాంచీ ఇసుకలో కూరుకుపోయింది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మునిగిపోయిన లాంచీని ఒడ్డుకు తీసుకొచ్చారు. ఇప్పటి వరకు కొందరి మృత దేహాలను వెలుపలకు తీశారు. 

More Telugu News