airplane: ఉడాన్‌ పథకం కింద అతి తక్కువ ధరలకే విమాన టికెట్లు

  • జెట్‌ ఎయిర్‌వేస్‌ ఆఫర్లు
  • రూ.967తో లక్నో-అలహాబాద్‌-పాట్నా మార్గంలో ప్రయాణం
  • పాట్నా-అలహాబాద్‌-పాట్నా మార్గంలో రూ.1216కే టికెట్

ఉడాన్‌ పథకం కింద నడిపే విమానాల టికెట్లపై జెట్‌ ఎయిర్‌వేస్‌ ఆఫర్లు ప్రకటించింది. ఇందులో భాగంగా తాము నడపనున్న మార్గాలను తెలిపింది. పాట్నా-అలహాబాద్‌-పాట్నా మార్గంలో టికెట్‌ ధర రూ.1216గా నిర్ణయించింది. అలాగే నాగ్‌పూర్‌-అలహాబాద్‌-నాగ్‌పూర్‌ మార్గంలో రూ.1690, ఇండోర్‌-అలహాబాద్‌-ఇండోర్‌ మార్గంలో ధర రూ.1914, ఢిల్లీ-నాసిక్‌-ఢిల్లీ విమాన టికెట్‌ ధర రూ.2,665లకే ఇస్తున్నట్లు జెట్ ఎయిర్‌వేస్‌ పేర్కొంది.

అలాగే, ధర రూ.967తో లక్నో-అలహాబాద్‌-పాట్నా మార్గంలో ప్రయాణించవచ్చని పేర్కొంది. కాగా, తక్కువ ధరలకే విమాన టిక్కెట్లు అందించాలన్న ఉద్దేశంతో భారత సర్కారు ఉడాన్‌ పథకంను ప్రారంభించి, 325 రూట్లను పలు విమానయాన సంస్థలకు కేటాయించింది.

More Telugu News