Congress: ఈ ఓటమిని అసలు ఊహించలేదు: కాంగ్రెస్ నేత డీకే శివకుమార్

  • ఈ ఆటలో మేము ఓడిపోయాం
  • ఈ ఓటమి స్థానిక నేతలకు ఎంతమాత్రం మంచిది కాదు
  • గెలిచి తీరతామనే అతివిశ్వాసం సిద్ధరామయ్యది!

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 78 స్థానాలతో సరిపెట్టుకుంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే శివకుమార్ స్పందిస్తూ, ఈ ఓటమిని ఊహించలేదని..ఈ ఆటలో తాము ఓడిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఓటమి స్థానిక నేతలకు ఎంతమాత్రం మంచిది కాదని సూచించారు. ఈ ఎన్నికల్లో గెలిచి తీరతామనే అతివిశ్వాసంతో సిద్ధరామయ్య ఉన్నారని వ్యాఖ్యానించారు. ‘కాంగ్రెస్’ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీ గెలుపు కోసం తన వంతు కృషి చేశారని అన్నారు.

కాగా, ఇదే విషయమై కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో సీనియర్ నేత వీరప్పమొయిలీ మాట్లాడుతూ, ఈ ఎన్నికల ఫలితాలు తమను ఎంతో నిరుత్సాహపరిచాయని అన్నారు. ఎన్నికలకు ముందు ‘లింగాయత్' ల అంశాన్ని కాంగ్రెస్ తెరపైకి తేలేదని, క్యాస్ట్ మేనేజ్ మెంట్ వ్యవహారానికి సంబంధించి ఎక్కడో పొరపాటు జరిగిందని, ఈ అంశం ఎన్నికల్లో కీలకపాత్ర పోషించిందని అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైనప్పటికీ రాహుల్ ను సమర్థించే విధంగా ఆయన వ్యాఖ్యలు చేశారు.

More Telugu News