kumaraswamy: కుమారస్వామికి సీఎం పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖత!

  • కర్ణాటకలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు
  • మ్యాజిక్ ఫిగర్ కంటే వెనుకబడ్డ బీజేపీ
  • జేడీఎస్, కాంగ్రెస్ ల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు

కర్ణాటక ఫలితాలు హంగ్ దిశగా వెలువడుతున్నాయి. తొలుత క్లియర్ మెజారిటీ దిశగా వెళ్లిన బీజేపీ ఆధిక్యత ఆ తర్వాత తగ్గింది. ప్రస్తుతం ఆ పార్టీ మ్యాజిక్ ఫిగర్ కంటే దాదాపు 8 సీట్లు వెనుకబడి ఉంది. ఈ నేపథ్యంలో, రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు? అనే ఉత్కంఠ సర్వత్ర నెలకొంది.

ఈ తరుణంలో బెంగళూరులో జేడీఎస్, కాంగ్రెస్ నేతలు సమావేశం అయ్యారు. ఎన్నికల ఫలితాలపై వారు చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవిని ఇచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని జేడీఎస్ కు కాంగ్రెస్ నేతలు స్పష్టం చేసినట్టు సమాచారం. ఇదే జరిగితే కర్ణాటకలో జేడీఎస్, కాంగ్రెస్ ల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

More Telugu News