Puri Jagannadh: ఈ రోజు సాయంత్రం దేవి థియేటర్‌కి రండి.. కలుద్దాం: పూరీ, ఛార్మీ

  • ఆర్టీసీ ఎక్స్‌ రోడ్‌లోని దేవి థియేటర్‌కు 'మెహబూబా' టీమ్‌
  • వీడియోలు విడుదల చేసి చెప్పిన పూరీ, ఛార్మీ
  • ఇటీవల విడుదలైన 'మెహబూబా'

ఈ రోజు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌ ఆర్టీసీ ఎక్స్‌ రోడ్‌లోని దేవి థియేటర్‌లో 'మెహబూబా' సినిమా టీమ్‌ సందడి చేయనుంది. ఆ సినిమా దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో పాటు నటి ఛార్మీ ఈ రోజు వేర్వేరుగా వీడియోలు విడుదల చేస్తూ అక్కడకు అందరూ వచ్చేయండని, కలుద్దామని, ఈ సినిమా టీమ్‌ మొత్తం అక్కడకు వచ్చేస్తోందని పిలుపునిచ్చారు. కాగా, పూరీ జగన్నాథ్‌ తన కుమారుడు ఆకాశ్ పూరీని హీరోగా పరిచయం చేస్తూ ఈ సినిమా తెరకెక్కించారు.

ఇందులో ఆశాశ్ పూరీ సరసన నేహాశెట్టి నటించింది. ఈ సినిమాని పూరీ జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ పతాకంపై శ్రీమతి లావణ్య సమర్పణలో పూరీ కనెక్ట్స్‌ నిర్మించింది. 'మెహబూబా'ను దిల్‌ రాజు విడుదల చేశారు. విభిన్న కథతో ఈ సినిమా రూపుదిద్దుకుంది.

More Telugu News