BJP: ఎట్టకేలకు అజ్ఞాతం వీడిన సోము వీర్రాజు!

  • విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఫోన్ చేసిన నేత
  • అధిష్ఠానం నిర్ణయమే నాకు శిరోధార్యం
  • ఈ నిర్ణయాన్ని నాయకులుగానీ, కార్యకర్తలు గానీ వ్యతిరేకించవద్దన్న సోము వీర్రాజు

ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న సోము వీర్రాజుకు ఆ పదవి లభించకపోవడంపై నిరాశతో అజ్ఞాతంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి కన్నా లక్ష్మీనారాయణకు దక్కడంతో అలకబూనిన సోము వీర్రాజు ఎట్టకేలకు అజ్ఞాతం వీడారు. 

విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఆయన ఫోన్ చేశారు. అధిష్ఠానం నిర్ణయమే తనకు శిరోధార్యమని, అధిష్ఠానం ఎంపికను అందరూ సమర్థించాల్సిందేనని చెప్పినట్టు సమాచారం. పార్టీ పెద్దలు తీసుకున్న నిర్ణయాన్ని నాయకులుగానీ, కార్యకర్తలు గానీ వ్యతిరేకించవద్దని తన అనుచరవర్గానికి ఆయన సూచించినట్టు తెలుస్తోంది. కాగా, ఈ ప్రకటనతో తమ పదవులకు రాజీనామాలు చేస్తామని ప్రకటించిన సోము వీర్రాజు వర్గం ఆలోచనలో పడ్డట్టు సమాచారం.

 
 

More Telugu News