apssdc: బీటెక్, ఎంసీఏ పూర్తి చేసిన వారికి సమ్మర్ సర్టిఫికేషన్ కోర్సు: ఏపీఎస్ఎస్డీసీ

  • లేటెస్ట్ టెక్నాలజీల్లో తీర్చిదిద్దేందుకు శిక్షణ కార్యక్రమాలు
  • ఉడా సిటీ నానో డిగ్రీస్, గూగుల్ వంటి సంస్థల ఆధ్వర్యంలో శిక్షణ
  • అతి తక్కువ ఫీజులకు అందిస్తున్న కోర్సులు

బీటెక్, ఎంసీఏ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారి కోసం ఏపీ ప్రభుత్వం మంచి అవకాశం కల్పించింది. ఇంజనీరింగ్, ఎంసీఏ పూర్తి చేసిన అభ్యర్థులను లేటెస్ట్ టెక్నాలజీల్లో అత్యంత నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దే నిమిత్తం నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) ఆధ్వర్యంలో సమ్మర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ పేరుతో ఈ శిక్షణా కార్యక్రమాలను రూపొందించింది. ఈ మేరకు ఏపీఎస్ఎస్డీసీ ఒక ప్రకటన విడుదల చేసింది.

ఇంజనీరింగ్ లోని అన్ని విభాగాలకు చెందిన వారితోపాటు ఎంసీఏ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా ఈ సర్టిఫికేషన్ ట్రైనింగ్స్ కు హాజరుకావచ్చు. ప్రస్తుతం మార్కెట్ లో అత్యుత్తమ సర్టిఫికేషన్ కోర్సులను అందిస్తున్న ఉడా సిటీ నానో డిగ్రీస్, గూగుల్, అమెజాన్, ఆటో డెస్క్ అండ్ డస్సాల్ట్, కోర్స్ విత్ యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ లాంటి సంస్థలతో ఏపీఎస్ఎస్డీసీ కలిసి పనిచేస్తోంది. మార్కెట్ లో శిక్షణ నిమిత్తం తీసుకునే ఫీజ్ కంటే అత్యంత తక్కువ ధరకే ఆయా కోర్సులను అభ్యర్థులకు అందివ్వాలని ఏపీఎస్ఎస్డీసీ నిర్ణయించింది.

ఉడాసిటీ నానో డిగ్రీస్ లో మెషీన్ లెర్నింగ్, ఆండ్రాయిడ్ డెవలపర్, ఫ్రండ్ ఎండ్, ఇంట్రడక్షన్ ఆఫ్ ప్రోగ్రామింగ్, ఫుల్ డెస్క్ లాంటి కోర్సులు నేర్చుకోవాలంటే మార్కెట్ లో 35 వేల నుంచి 60 వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కోర్సులకు కేవలం రూ.6 వేల రూపాయల ఫీజుతో ట్రైనింగ్ ఇవ్వనుంది.

ఇక అమెజాన్ కోర్సులకు సంబంధించి అనలిటిక్స్ &బిగ్ డాటా, క్లౌడ్ ఆర్కిటెక్ట్స్, ఆపరేటర్స్/సపోర్ట్ ఇంజనీర్, సాఫ్ట్ వేర్ డెవలపర్ ఇంజనీర్ విభాగాల్లోని సర్టిఫికేషన్ కోర్సులను ఉచితంగా శిక్షణ ఇవ్వనుంది. ఎపిఎస్‌ఎస్‌డిసి అధికారులు తెలిపారు. వీటితోపాటు మరిన్ని విభాగాల్లో శిక్షణ అందివ్వనుంది. బీటెక్, ఎంసీఏ పాసై శిక్షణ పొందాలనే ఆసక్తి ఉన్న వారు ‘http://engineering.apssdc.in/certification/’ వెబ్ సైట్ లో వారి అర్హతలతో పాటు ఇతర వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. శిక్షణతోపాటు ఇతర సమాచారాన్ని అభ్యర్థుల ఈ-మెయిల్స్ కు పంపుతామని తెలిపారు.

More Telugu News