Tollywood: అరవింద్ సార్.. థ్యాంక్యూ!: హీరో విజయ్ దేవరకొండ

  • 'మహానటి' టీమ్ ను డిన్నర్ కు ఆహ్వానించడంపై విజయ్ ట్వీట్ 
  • ఇండస్ట్రీని ఒక దగ్గరకు చేర్చినందుకు ధన్యవాదాలు
  • నిన్న పార్టీలో దుల్కర్, సమంతాను మిస్సయ్యా!

'మహానటి' సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిన్న రాత్రి అశ్వనీదత్ ఫ్యామిలీని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆహ్వానించి డిన్నర్ పార్టీ  ఏర్పాటు చేశారు. ఈ డిన్నర్ పార్టీకి అల్లు అర్జున్ తో పాటు ప్రముఖ దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, హీరో విజయ్ దేవరకొండ కూడా హాజరయ్యారు.

ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ ప్రస్తావిస్తూ తాజాగా ఓ ట్వీట్ చేశాడు. ‘‘మహానటి పార్టీలు..సన్మానాలు - నిన్నరాత్రి- దుల్కర్, సమంతను మిస్సయ్యాను. మా ముఖ్యమైన వ్యక్తి, గురు నాగ్ అశ్విన్ & మల్టీ మిలియనీర్స్ వైజయంతి ఫిల్మ్స్ ను ఆనందపరచినందుకు, ఇండస్ట్రీని ఒక చోటుకు చేర్చినందుకు.. అరవింద్ సార్ థ్యాంక్యూ’ అని ఆ ట్వీట్ లో తన ధన్యవాదాలు తెలిపాడు. 

More Telugu News