Telangana: తెలంగాణలో ఎవరితోనూ పొత్తు ఉండదు: బీజేపీ నేత లక్ష్మణ్

  • 2019 సార్వత్రిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో మేమే పోటీ చేస్తాం
  • వచ్చే నెలలో తెలంగాణలో బీజేపీ బస్సుయాత్ర నిర్వహిస్తాం
  • కేసీఆర్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తాం
  • తెలంగాణలో అమిత్ షా పర్యటించనున్నారు

2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో ఎవరితోనూ పొత్తు ఉండదని, అన్ని స్థానాల్లో తామే పోటీ చేస్తామని టీ-బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ఢిల్లీలో అన్ని రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల సమావేశం ఈరోజు జరిగింది. ఈ సమావేశానికి లక్ష్మణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, వచ్చే నెలలో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ బస్సుయాత్ర నిర్వహించనున్నట్టు చెప్పారు. 

కేసీఆర్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఈ బస్సు యాత్ర ద్వారా ప్రజలకు వివరిస్తామని, రాష్ట్రంలో బీజేపీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేస్తామని చెప్పారు. అసెంబ్లీ, లోక్ సభ స్థానాల్లో పార్టీ పరిస్థితిపై నివేదిక సిద్ధం చేస్తున్నామని, తెలంగాణలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా త్వరలో పర్యటించనున్నట్టు చెప్పారు.
 

More Telugu News