ashwani dutt: మహేశ్ తో మూవీ తరువాత ఎన్టీఆర్ తో చేస్తాం: నిర్మాత అశ్వనీదత్

  • వైజయంతీ మూవీస్ నుంచి 'మహానటి'
  • భారీ వసూళ్లతో ఘనవిజయం 
  • ఇకపై ఆ బ్యానర్లో వరుస సినిమాలు    

వైజయంతీ మూవీస్ బ్యానర్ పై వచ్చిన ఎన్నో చిత్రాలు భారీ విజయాలను అందుకున్నాయి. అగ్రకథానాయకులతో భారీ బడ్జెట్ తో ఈ సంస్థ నిర్మించిన సినిమాలు, ఆయా హీరోల కెరియర్లో చెప్పుకోదగినవిగా నిలిచిపోయాయి. అందుకే ఇప్పటికీ ఈ బ్యానర్లో నటించడానికి క్రేజ్ వున్న హీరో హీరోయిన్లు ఉత్సాహాన్ని చూపుతుంటారు. అలాంటి ఈ సంస్థ నుంచి కొంత గ్యాప్ తరువాత వచ్చిన 'మహానటి' సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో అశ్వనీదత్ మాట్లాడుతూ .. ఇకపై తమ బ్యానర్లో వరుస సినిమాలు నిర్మిస్తామని చెప్పారు. ప్రస్తుతం మహేశ్ తో ఒక సినిమాను నిర్మిస్తున్నామనీ, ఆ తరువాత ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయనున్నామని అన్నారు. ఈ సినిమాకి దర్శకుడు ఎవరనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదనీ, త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. గతంలో వైజయంతీ మూవీస్ బ్యానర్లో ఎన్టీఆర్ చేసిన 'శక్తి' సినిమా పరాజయంపాలైన సంగతి తెలిసిందే.    

More Telugu News