rangsthalam: టీవీలో ‘రంగస్థలం’ చూసిన ‘రంగమ్మత్త’!

  • అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో ఈ చిత్రాన్ని వీక్షించిన అనసూయ
  • ఈ సినిమా విడుదలై నలభై ఐదు రోజులు పూర్తి
  • ఒప్పందం ప్రకారం డిజిటల్ స్ట్రీమింగ్ ప్రారంభించిన ‘అమెజాన్’

గత నెలలో విడుదలైన  చిత్రం ‘రంగస్థలం’లో ప్రముఖ యాంకర్-నటి అనసూయ రంగమ్మపాత్రలో ఆకట్టుకుంది. ప్రేక్షకుల మన్ననలు కూడా పొందిన విషయం తెలిసిందే. బాక్సాఫీస్ రికార్డులు నెలకొల్పిన ఈ చిత్రాన్ని అనసూయ టీవీలో వీక్షించింది. అలా అని చెప్పి ‘రంగస్థలం’ టీవీ ఛానెల్స్ లో ప్రసారమైందని అనుకోవద్దు.

అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో ‘రంగస్థలం’ చూస్తూ దిగిన ఓ ఫొటోను అనసూయ తన పోస్ట్ లో జతపరిచింది. కాగా, ఈ సినిమా విడుదలై నలభై ఐదు రోజులు పూర్తయింది. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం అమెజాన్ డిజిటల్ స్ట్రీమింగ్  ప్రారంభించడంతో వీక్షకులు ఈ సినిమాను చూస్తున్నారు. 

More Telugu News