twitter: ట్విట్టర్లో ప్రచారం అయ్యేవాటిలో 91 శాతం తప్పుడు వార్తలేనట!

  • అత్యవసరాల్లో సమాయాల్లో చాలా మంది చేస్తున్న పని ఇదే
  • సందేహం వ్యక్తం చేస్తున్న వారు తక్కువ మందే
  • అమెరికాలో జరిగిన అధ్యయనం

ట్విట్టర్ సామాజిక మాధ్యమం గాలి వార్తలకు వేదికగా నిలుస్తోంది. ఇందుకు నిదర్శనంగా ట్విట్టర్ యూజర్లు వ్యాప్తి చేసే వార్తల్లో 86-91 శాతం తప్పుడువేనని అమెరికాలో ఓ అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా అత్యవసర సమయాల్లో చాలా మంది యూజర్లు ఫేక్ వార్తలను రీట్వీట్ చేస్తూ లేదా లైక్ కొడుతున్నారట. ఈ అధ్యయనం వివరాలు జర్నల్ నేచురల్ హజార్డ్ అనే పత్రికలో ప్రచురితమయ్యాయి.

కేవలం ఐదు నుంచి తొమ్మిది శాతం మంది యూజర్లు మాత్రమే తప్పుడు వార్తా? కాదా? అని వచ్చిన వార్తను రీట్వీట్ చేసి నిర్ధారించుకుంటున్నట్టు అధ్యయనకారులు గుర్తించారు. కేవలం 1-9 శాతం లోపు వారు వార్తల కచ్చితత్వంపై సందేహం వ్యక్తం చేస్తున్నారని తెలిసింది. ఇక తప్పుడు వార్తలను వ్యాప్తి చేసిన వారిలో పది శాతం మంది వరకు తర్వాత వాటిని డిలీట్ చేస్తున్నారట.

More Telugu News