Hema Malini: రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న బీజేపీ ఎంపీ హేమమాలిని

  • ఎంపీ కాన్వాయ్ ముందు కూలిన చెట్టు
  • గమనించి బ్రేక్ వేసిన డ్రైవర్
  • ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌లో భారీ వర్షాలు

బీజేపీ ఎంపీ హేమమాలిని తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఉత్తరప్రదేశ్ మధురలో ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తుండగా ఆమె కాన్వాయ్ ముందు పెద్ద చెట్టు కూలింది. చెట్టు కూలుతున్న విషయాన్ని గమనించిన డ్రైవర్ బ్రేక్ వేయడంతో పెను ప్రమాదం తప్పింది. మాంట్ తహశీల్‌లోని మిట్టౌలీ గ్రామంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న హేమమాలిని ప్రసంగిస్తుండగా వాతావరణంలో అకస్మాత్తుగా మార్పులు చోటుచేసుకున్నాయి.

దీంతో వెనక్కి వెళ్లిపోవాలని ఎంపీ నిర్ణయించుకున్నారు. కాన్వాయ్ బయలుదేరిన కాసేపటికే ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. కాగా, ఉత్తరప్రదేశ్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా దేశవ్యాప్తంగా 29 మంది మృతి చెందారు.  

More Telugu News